కేసీఆర్ బాటలో చంద్రబాబు.. గెలుపు కోసమే అలా చేస్తున్నారా?

by Disha Web Desk 18 |
కేసీఆర్ బాటలో చంద్రబాబు.. గెలుపు కోసమే అలా చేస్తున్నారా?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల వేళ ఏపీ రాజకీయం హీటెక్కుతోంది. గెలుపు దిశగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఉండవల్లి లోని నివాసంలో రాజశ్యామల యాగం చేసిన విషయం తెలిసిందే. మూడు రోజులపాటు నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా రాజ శ్యామల యాగాన్ని చేశారు.

మొదటి రోజు పూజా కార్యక్రమాలు యాగక్రతువులో చంద్రబాబు నాయుడు భువనేశ్వరి పాల్గొన్నారు. మూడు రోజుల పాటు పూజలు క్రతువులు నిర్వహించారు. మొత్తంగా మూడు రోజులు యాగం జరిగింది. ఆఖరి రోజున పూర్ణాహుతితో యాగం ముగిసింది. అయితే ఎన్నికల ముందు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా యాగలు చేశారంట. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యాగం చేయడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాజశ్యామల యాగం చేస్తున్నారని నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Read More..

వైసీపీ మేనిఫెస్టోపై చంద్రబాబు రియాక్షన్ ఇదే..!



Next Story

Most Viewed