- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
బిక్షాటన చేసే దుస్థితికి తీసుకొచ్చారు!.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
![బిక్షాటన చేసే దుస్థితికి తీసుకొచ్చారు!.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్ బిక్షాటన చేసే దుస్థితికి తీసుకొచ్చారు!.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348189-panchayithi-employees.webp)
దిశ, డైనమిక్ బ్యూరో: కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం బాధాకరమని, పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. జీతాలు లేకపోవడంతో విధుల భహిష్కరణ చేసి భిక్షాటన చేస్తున్న పంచాయితీ కార్మికుల ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా పంచాయితీ కార్మికులు పనిచేస్తున్నారని, అలాంటి కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో విధులు బహిష్కరించి గ్రామాల్లో భిక్షాటన చేస్తూ.. నిరసన తెలిపే దుస్థితి ఏర్పడిందని ఫైర్ అయ్యారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు ఎక్స్ లో రాసుకొచ్చారు.