ఆ కాలేజీలు కూలిస్తే రేవంత్ HERO అవుతారు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ఆ కాలేజీలు కూలిస్తే రేవంత్ HERO అవుతారు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా అధికారులు ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తున్నారని ప్రశ్నించారు. ఏ రోజు కూలుస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒవైసీ కాలేజీలను కూల్చకపోతే హైడ్రా మిషన్ విఫలం అయినట్లే అని విమర్శించారు. ఒవైసీ కాలేజీలను కూలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హీరో అవుతారని సూచించారు. కాగా, ఆక్రమ నిర్మాణాలు చేసిన అక్రమార్కుల పాలిట హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆదివారం ఒకేసారి నగరంలోని మూడుచోట్ల కూల్చివేతలు చేపట్టింది. అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద, మదాపూర్‌ సున్నపుచెరువు వద్ద, మేడ్చల్ జిల్లాలోని పలుచోట్ల నిర్మాణలు గుర్తించి అధికారులు కూల్చివేశారు.

Advertisement

Next Story

Most Viewed