- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
‘మహిళలని కూడా చూడరా..?’ పోలీసుల తీరుపై BJP ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఫైర్
by Satheesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్స్ పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో టీజీపీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన బీజేవైఎం నాయకులపై పోలీసులు దాడి చేయడం సరికాదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మహిళలని కూడా చూడకుండా దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా ఏలేటి శనివారం పోలీసుల తోపులాటలో గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేవైఎం నేతలు మహేష్, అనిత రెడ్డి, సహా పలువురు నేతలను ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కాగా ఆయన మాట్లాడుతూ.. విచక్షణ రహితంగా బీజేవైఎం నేతలను పోలీసులు ఈడ్చి వేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
Advertisement
Next Story