కాంగ్రెస్ సర్కార్ పై బీజేపీ కుట్ర చేస్తోందని కేసీఆర్ అనడం సరికాదు:లక్ష్మణ్

by Disha Web Desk 13 |
కాంగ్రెస్ సర్కార్ పై బీజేపీ కుట్ర చేస్తోందని కేసీఆర్ అనడం సరికాదు:లక్ష్మణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. శుక్రవారం సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేసీఆర్ అడనం సరికాదని ఆ ఆలోచన మాకు లేదని అన్నారు. ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారని హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అడుగు జాడలో కాంగ్రెస్ పయనిస్తోందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. సికింద్రాబాద్ బీజేపీకి కంచుకోట అని, ఇక్కడ కమలం పార్టీ గెలుపు ఖాయం అయిందన్నారు. సికింద్రాబాద్ ప్రజల తలలో నాలుకలా కిషన్ రెడ్డి పని చేశారని రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ మచ్చుకైనా ప్రభావం చూపవన్నారు. 17 స్థానాల్లో బీజేపీ గెలుపు దిశగా వెళ్తోందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed