సింగర్ గా మారిన బండి సంజయ్.. పాటతో అదరగొట్టిన కేంద్ర మంత్రి

by Prasad Jukanti |
సింగర్ గా మారిన బండి సంజయ్.. పాటతో అదరగొట్టిన కేంద్ర మంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయంగా ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సింగర్ గా మారారు. ఓ కార్యక్రమంలో పాట పాడి అదరగొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా దీనిపై నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం హుస్నాబాద్ (బార్గవాపురం)లో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను శిశుమందిర్ లోనే చదువుకున్నానని తన అనుభవాలను చెప్పుకొచ్చారు. ఇవాళ హిందూ ధర్మం, దేవుళ్లను హేళన చేసే పరిస్థితులు సమాజంలో కనిపిస్తున్నాయని అన్నారు. అలాంటివి చూస్తే తనకు ఓ పాట గుర్తుకు వస్తుందని 'ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం..కష్టసుఖముల లోన కలిసి మెలసుంటుంటే..బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారుకలలన్ని పండేనురా..!!' అనే పాటను పాడి వినిపించారు. దీంతో బండి సంజయ్ పాటకు అక్కడున్నవారంతా చప్పట్లతో ప్రశంసించారు.






Next Story