హైడ్రాపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
హైడ్రాపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పాలన గాలికి వదిలి హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పక్కదోవ పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు. నేత కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం మర్చిపోయారని, అన్నీ తామే గుర్తు చేస్తే ఇంకా మీరు ఉండి ఎందుకు అని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరుతో ప్రజలకు సినిమా చూపిస్తున్నారన్నారు. పెద్దవాళ్ళు భూములు ఆక్రమించి కట్టుకుంటే వారి దగ్గర లాక్కొని పేదలకు ఇవ్వాలి గాని, పేదల వద్ద కూడా లాక్కుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. సీఎం ప్రతాపం జన్వాడ ఫామ్ హౌస్ మీద గాని, సకలం చెరువులో కట్టిన భవనాల మీద ఎందుకు చూపించడం లేదని అన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదని రేవంత్ కు కూడా తెలుసని, దాని నుండి తప్పించుకోవడానికే హైడ్రాను ముందుకు తెచ్చారని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

Next Story

Most Viewed