- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఆ సొమ్ము ఎగ్గొట్టినందుకు సంబురాలా.. సర్కారుపై బండి సంజయ్ ఫైర్
దిశ, వెబ్డెస్క్: రైతు రుణమాఫీ సంబురాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఏం సాధించారని సంబురాలు చేసుకుంటారన్నారు. రబీ, ఖరీఫ్లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుకా? అని ప్రశ్నించారు. పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా అన్నారు. రాబోయే ‘స్థానిక సంస్థల’ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ రుణమాఫీ డ్రామా అని బండి మండి పడ్డారు. రైతు భరోసా పేరుతో రబీ, ఖరీఫ్ సీజన్ లో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
రైతు భరోసా సదస్సుల పేరుతో జాప్యం చేస్తూ రైతులను అరిగోస పెడతారా? అన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లో రైతులకు చెల్లించాల్సిన ‘రైతు భరోసా’ సొమ్ము రూ.20 వేల కోట్లకుపైనే అని.. రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టి ఆ డబ్బులో కొంత భాగాన్ని రుణమాఫీకి మళ్లించి రైతులకు మేలు చేసినట్లు ఫోజు కొడతారా? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ మూర్ఖత్వంవల్లే రైతులు డిఫాల్టర్లుగా మారారన్నారు. బ్యాంకులో రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ వడ్డీతో సహా బకాయిలు చెల్లించి ‘నో డ్యూస్ సర్టిఫికేట్’ ఇప్పించే బాధ్యత సర్కార్దే అన్నారు. ఎన్నికల హామీ మేరకు రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.