గుత్తా సుఖేందర్ రెడ్డితో ఏపీ శాసనమండలి చైర్మన్ భేటీ

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-16 15:24:39.0  )
గుత్తా సుఖేందర్ రెడ్డితో ఏపీ శాసనమండలి చైర్మన్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి(AP Legislative Council) ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు(Koyye Moshenu Raju) బుధవారం హైదరాబాద్‌లో పర్యటించారు. తెలంగాణ శాసన మండలిని ఆయన సందర్శించారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy)తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. చాలా సేపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తాజా రాజకీయ పరిణామాలపై సుధీర్ఘంగా ఇరువురు చర్చించారు. అనంతరం ఏపీ మండలి చైర్మన్ మోషేన్ రాజును శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా.నరసింహాచార్యులు ఉన్నారు.

Advertisement

Next Story