- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Asaduddin Owaisi : హాపూర్ కోర్టులో అసదుద్దీన్ ఒవైసీ వాంగ్మూలం
దిశ, నేషనల్ బ్యూరో : మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం ఉత్తరప్రదేశ్లోని హాపూర్ అదనపు జిల్లా జడ్జి కోర్టు ఎదుట హాజరయ్యారు. రెండేళ్ల క్రితం (2022 ఫిబ్రవరి 3న) హాపూర్ జిల్లా పిల్ఖువా టోల్ప్లాజా వద్ద అసదుద్దీన్ వాహన కాన్వాయ్పైకి సచిన్ శర్మ, శుభం అనే యువకులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. అయితే అసద్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆయన సురక్షితంగా టోల్ప్లాజా వద్ద నుంచి తప్పించుకోగలిగారు. ఈ ఘటనపై అప్పట్లో పిల్ఖువా ఏరియా పోలీసులు కేసు నమోదు చేశారు.
కాల్పులకు తెగబడిన నిందితులు సచిన్ శర్మ, శుభంలను వెంటనే అరెస్టు చేసినప్పటికీ, అనంతరం వారిద్దరికీ బెయిల్ మంజూరైంది. ఈ కేసులో బాధితుడిగా తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు బుధవారం కోర్టుకు అసదుద్దీన్ ఒవైసీ వచ్చారు. కోర్టులో విచారణ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, గురువారం రోజు కూడా కోర్టుకు అసద్ వస్తారని స్థానిక పోలీసులు వెల్లడించారు.