కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by Rajesh |   ( Updated:2024-06-29 08:36:35.0  )
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్ : జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులోని ఆంజనేయస్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపటి క్రితం దర్శించుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కు పండితులు వేదాశీర్వచనాలు అందించారు. ఎన్నికల ముందు వారాహి వాహనంలో కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్ పూజలు నిర్వహించారు. పవన్ పర్యటన దృష్ట్యా కొండగట్టు అంజన్న క్షేత్రంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు సిద్ధిపేటలో పవన్ అభిమానులు గజమాలతో సత్కరించారు. కారుపైకి ఎక్కి అభిమానులకు పవన్ అభివాదం చేశారు.

Advertisement

Next Story

Most Viewed