‘సగం సగం చెప్తావేంటన్నా’.. కిషన్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ

by Gantepaka Srikanth |
‘సగం సగం చెప్తావేంటన్నా’.. కిషన్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వచ్చారు. ఆయన వెంట తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం ఉన్నారు. కాగా వారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని గురువారం కలిశారు. అయితే పార్టీ కార్యాలయంలోకి వచ్చీ రాగానే కిషన్ రెడ్డిని ‘అన్నా అంటూ’ మల్లారెడ్డి పలకరించారు. కాగా ఆయన్ను స్వాగతం అంటూ ఆహ్వానించారు. దీంతో మల్లారెడ్డి.. సగం సగం చెప్తావేంటన్నా.. పూర్తి స్థాయిలో అహ్వానం ఎప్పుడంటూ చమత్కరించారు. స్వాగతానికి మించి ఏం చెప్పమంటారో మీరే చెప్పండి అంటూ కిషన్ రెడ్డి పలకరించారు.

ఈ సందర్భంగా తన మనవరాలి పెళ్లికి రావాలని కిషన్ రెడ్డిని మల్లారెడ్డి ఆహ్వానించారు. అనంతరం కిషన్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 10 నిమిషాల పాటు ఇరువురు చర్చించారు. అనంతరం మీడియాతో మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. కిషన్ రెడ్డి తన ఫ్రెండ్ అని, 30 ఏండ్లకు పైగా తనకు తెలుసని చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని కొనియాడారు. రాజకీయ అంశాలు మాట్లాడారా? అని మీడియా ప్రశ్నించగా ప్రతిసారి రాజకీయాలేనా? అంటూ ప్రశ్నించారు. ఆపై చంద్రబాబు తనకు రాజకీయ భిక్ష పెట్టాడని చెప్పారు. ఆయన దయవల్లే తాను ఎంపీ అయ్యానని, బీజేపీ, టీడీపీ పొత్తు వల్ల ఆనాడు పార్లమెంట్ కు వెళ్లానని గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed