అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు

by GSrikanth |
అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 24వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నిర్వహిస్తోన్న విజయ సంకల్ప యాత్రలో అమిత్ షా పాల్గొన్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రచారం మొదలుపెట్టింది.

కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని, తెలంగాణలో పది ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప రథయాత్రలను కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్‌ను మినహాయించి 16 ఎంపీ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది. ఒక్కో క్లస్టర్‌ పరిధిలో మూడు నుంచి నాలుగు ఎంపీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఐదు క్లస్టర్లకు చారిత్రక ప్రదేశాల పేర్లు పెట్టారు. కిషన్‌రెడ్డి సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయపార్టీ ముఖ్యనేతలు యాత్రల్లో పాల్గొంటారని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed