అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు.. ఎన్నికల తర్వాత తొలిసారి

by GSrikanth |
అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు.. ఎన్నికల తర్వాత తొలిసారి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 28వ తేదీన షా రాష్ట్రంలో పర్యటించబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్‌ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మండలాల అధ్యక్షులతో అమిత్ షా సమావేశం ఉంటుందని తెలిపారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అమిత్ షా తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 8 మంది గెలుపొందారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు సహా కీలక నేతలంతా ఓటమి చెందారు. దీంతో లోక్‌సభ ఎన్నికలపై పార్టీ సీనియర్లకు షా కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed