కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక SRDP పనులన్నీ మందగించాయి: KTR ట్వీట్

by Anjali |   ( Updated:2024-08-27 15:50:10.0  )
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక SRDP పనులన్నీ మందగించాయి: KTR ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు, కనెక్టింగ్ రోడ్లపై ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్‌లో SRDP (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) హైదరాబాద్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రధాన చొరవ తీసుకున్నామని తెలిపారు. దీని కింద కేసీఆర్ ప్రభుత్వం 42 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిందని అన్నారు. అందులో 36 సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిందని గుర్తుచేశారు. మిగిలిన ప్రాజెక్టులను కూడా 2024లో పూర్తి చేయాల్సి ఉండేనని అన్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతున్న SRDP పనులన్నీ మందగించాయని వెల్లడించారు. పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని ఎద్దేవా చేశారు. గత 8 నెలలుగా సరైన పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు కూడా జరగడం లేదని ఫైర్ అయ్యారు. SRDP ఫేజ్- 3 ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరండని కేటీఆర్ అన్నారు. ఈ జాబితాలో మూసీతో పాటు ఎక్స్‌ప్రెస్ వే, KBR పార్క్ కింద టన్నెల్స్, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లు ఇలా.. అనేక ఇతర గ్రేడ్ సెపరేటర్లు ఉన్నాయని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed