ALERT : ఐసెట్ ఎంట్రెన్స్ రాసే విద్యార్థులకు బిగ్ అలర్ట్

by Disha Web Desk 4 |
ALERT : ఐసెట్ ఎంట్రెన్స్ రాసే విద్యార్థులకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ ఎంట్రెన్స్ రాసే విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఐసెట్ పరీక్ష ఫీజు గడవును కాకతీయ యూనివర్సిటీ పొడిగించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 7వరకు గడువు విధించింది. రూ.500 అపరాధ రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీకి చెందిన విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.750 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది.

Next Story

Most Viewed