ఆగి ఉన్న కారులోంచి రూ.18 లక్షల చోరీ..

by Nagam Mallesh |
ఆగి ఉన్న కారులోంచి రూ.18 లక్షల చోరీ..
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆగి ఉన్న ఓ కారు లోంచి రూ.18 లక్షల చోరీ ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాదుకు చెందిన వాసవి ట్రేడర్స్ కంపెనీ ప్రతినిధులు వ్యాపార పని నిమిత్తం బెల్లంపల్లికి శనివారం వచ్చారు. పట్టణంలోని బజార్ ఏరియాలో తమ కారును పార్కింగ్ చేసి ఉంచారు. కారు పార్కింగ్ నుంచి కొద్దిదూరంలో తమకు రావలసిన బిల్లులను వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. ఇదే క్రమంలో కారులో ఉన్న రూ.18 లక్షలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. పని ముగించుకొని తిరిగి కారు వద్దకు వచ్చిన వారికి కారులో ఉన్న డబ్బులు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.18 లక్షలు ఉన్న బ్యాగును బైక్ పై ఎత్తుకెళ్లిన దుండగుల ఫొటోలు బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయం వద్ద సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story

Most Viewed