- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పోలీసువారి ఆంక్షలు.. జిల్లాలో ఆన్లైన్ అవస్థలు..
దిశ,చింతలమానేపల్లి : ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిన చందాగా.. జిల్లాలో ఇంటర్నెట్ వినియోగదారుల పరిస్ధితి ఉంది. గత ఐదురోజులుగా జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ పని చేయకపోవడంతో దాని ఆధారంగా కార్యకలాపాలు సాగించేవారు, ముఖ్యంగా ఇంటర్నెట్ సాయంతో పని చేసే ఉద్యోగులు, విద్యార్ధులు అష్టకష్టాల పడుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలానికి చెందిన ఆదివాసి మహిళ పై ముస్లిం యువకుడు అత్యచారం చేయడంతో ఆదివాసి సంఘం నాయకులు ఆందోళనతో అతలాకుతలమై అగ్గిరాజుకున్న నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా ఇంటర్నెట్ బంద్పై పోలీసుశాఖ కఠిన నిర్ణయం తీసుకున్నారు. పైగా ఆసిఫాబాద్ జిల్లా లో అల్లర్లకు పాల్పడిన వారంతా వాట్సాప్ వినియోగం ద్వారా తమ ప్రణాళికను షురూ చేశారన్న ప్రధాన అంశాన్ని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు.
ప్రధానంగా ఇంటర్నెట్ వినియోగం ద్వారా ఆన్లైన్ మేసేజ్లు,వాట్సాప్ ఛాటింగ్ల ద్వారానే తమ కార్యకలాపాలను పక్కా ప్రణాళికతో నిర్వహించినట్లు పోలీసు ఉన్నతాధికారులే స్పష్టం కావడంతో ఇంటర్నెట్ ని బంద్ పెట్టారు.అయితే అల్లర్లు కట్టడి చేసి పరిస్థితి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటికీ జిల్లాలోనీ జైనూర్ మండలంలో దాదాపు 3000 మంది పోలీస్ వాళ్లతో పకడ్భందీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అసాంఘిక శక్తులు చెలరేగకుండా అదనపు బలగాలు మోహరించి కవాతు చేస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటూనే మరోవైపు అల్లర్లకు పాల్పడిన నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో నిందితులు తప్పించుకోకుండా వారి మధ్య కమ్యూనికేషన్ లేకుండా ఉండేందుకు ఇంటర్నెట్కు పోలీసులు బ్రేక్ వేశారు.
శాంతియుత వాతావరణం పూర్తయ్యాకే ఇంటర్నెట్ పునరుద్ధరణ..
జిల్లా అల్లర్లతో ప్రమేయం ఉన్న వారందరినీ గుర్తించి అరెస్టులు పూర్తి చేసిన తర్వాతే జిల్లాలో శాంతియుత వాతావరణం పూర్తయ్యాకే ఇంటర్నెట్ పునరుద్ధరణ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించనున్నట్లు పోలీస్ శాఖ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రజల జీవనానికి విఘాతం లేకుండా సామరస్యమైన వాతావరణం నెలకొల్పినా నెట్ సేవలు లేకపోడవంతో కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి వర్తక, వాణిజ్య కార్యకలాపాలకు ముడిపడి ఉన్న ఆన్లైన్ చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో డిజిటల్ కరెన్సీ మారకానికి ఇబ్బంది ఎర్పడటంతో ప్రజలకు ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు రీఛార్జ్లు, బ్యాంకు సేవలు,ఆన్లైన్ సేవలు వంటి కార్యకలాపాలకు ప్రస్తుతం భంగం వాటిల్లిన నేపధ్యంలో నెట్ సేవలు పునరుద్ధరణకు జిల్లాలో పూర్తి స్ధాయి ప్రశాంతత నెలకొనాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఆదివాసీల విషయంలో ఆదివారం అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతున్నందున మరో రెండు, మూడు రోజుల వరకు నెట్ సేవలు ఉండకపోవచ్చనే అభిప్రాయం నెలకొంది. పోలీసువారి ఆంక్షలు.. జిల్లాలో ఆన్లైన్ అవస్థలు..అదేవిధంగా నిందితులను పూర్తిగా గుర్తించి అరెస్టు చేసేందుకే ఇలా చేశారని స్పష్టమవుతోంది. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారుల సెల్ఫోన్ లు మాత్రమే పని చేస్తున్నట్లు తెలుస్తోంది.