ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలి : ఎస్పీ గౌస్ ఆలం

by Aamani |
ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలి : ఎస్పీ గౌస్ ఆలం
X

దిశ, ఆదిలాబాద్ : మారుతున్న సమాజం లోని ప్రజలను దృష్టిలో ఉంచుకుని వారితో సత్సంబంధాలను ఏర్పరచుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పోలీసులకు సూచించారు. బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన జిల్లా ఎస్పీ గౌస్ ఆలంకు సాయుధ బలగాల తో కూడిన బృందం గౌరవ వందనాలు అందించగా, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు సునీల్, కరుణాకర్ పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానించారు.ఇందులో భాగంగా కార్యాలయ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదు దారు పిటిషన్ వెంటనే నమోదు చేసి, సంబంధిత అధికారులకు అప్పగించి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు.

సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించినప్పుడే ప్రజలలో పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలను పెంచుకోవాలని, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా వారిని ప్రోత్సహించాలని అన్నారు. రాత్రి సమయాల్లో అదనంగా గస్తీ నిర్వహిస్తూ, ఆర్థిక నేరాలను కట్టడి చేసే విధంగా ప్రణాళికను రూపొందించి అవలంబించాలని ఆదేశించారు. సిబ్బంది ఎల్లవేళలా పోలీస్ స్టేషన్ లో అప్రమత్తంగా ఉండి ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా అందుబాటులో ఉండాలన్నారు.అనంతరం కార్యాలయం లోని రికార్డులను పరిశీలించారు. ఇందులో పలువురు పోలీసులు ,డీఎస్పీ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story