అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఎడ్లు పట్టివేత

by Nagam Mallesh |
అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఎడ్లు పట్టివేత
X

దిశ, చింతలమానేపల్లిః నాలుగు ఎడ్లు ఒక బొలెరో వాహనాన్ని డబ్బా గ్రామం వద్ద పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.. ఎస్ ఐ వివరాల ప్రకారం చింతలమానేపల్లి మండలంలోని కర్జవెల్లి గ్రామం నుంచి అక్రమంగా లక్ష్యపేట్ కు నాలుగు ఎడ్లను తరలిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో డబ్బా గ్రామంలో పట్టుకున్నామన్నారు. ఎలాంటి రసీదులు లేకుండా అక్రమంగా తరలిస్తుండగా డబ్బా ఎక్స్ రోడ్ వద్ద పట్టుకుని బొలెరో వాహనం సీజ్ చేసి డ్రైవర్ సయ్యద్ అజీమొద్దిన్, తిరుపతి, దండేపల్లి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎడ్లను కాగజ్ నగర్ గోశాలకు పంపినట్లు ఎస్ఐ ఇస్లవత్ నరేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed