ఇక ఆటపాటలతో చదవు.. పూర్వ ప్రాథమిక విద్యపై సర్కార్ ఫోకస్

by Shiva |
ఇక ఆటపాటలతో చదవు.. పూర్వ ప్రాథమిక విద్యపై సర్కార్ ఫోకస్
X

దిశ, భైంసా: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.అంగన్వాడీ కేంద్రాల్లో విద్యతో పాటు ఆయా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికారం అందిస్తూ వారి భవితకు బాట వేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)లో భాగంగా ఆటపాటల ద్వారా పిల్లలు విద్యను అభ్యసించేందుకు ప్రణాళిక చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలు ఇక పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలుగా బలపరిచేందుకు అవసరమయ్యే ఫ్రీ స్కూల్ మెటీరియల్, కిట్స్ పంపిణీపై నిమగ్నమైంది.

అయితే, ప్రైవేట్‌కు ధీటుగా పూర్వ ప్రాథమిక పాఠశాలలో చదివే పిల్లలు విద్యను అభ్యసించడానికి కావలసిన సౌకర్యవంతమైన కిట్స్, మెటీరియల్ ఇప్పటికే సంబంధిత సీడీపీవో ఆఫీసులకు చేరినట్లుగా సమాచారం. ఇప్పటికే జిల్లాల్లోని సూపర్‌వైజర్స్ పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యకు సంబంధించి ఐదు రోజులు హైదరాబాద్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుకోగా, సంబంధిత అంగన్వాడీ, పూర్వ ప్రాథమిక విద్య టీచర్లకు తాము నేర్చుకున్న నూతన కరిక్యూలం‌పై మూడు రోజులు సంబంధిత బుక్స్ మీద ట్రైనింగ్, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అయితే, పిల్లలు ఈజీగా విద్యను అభ్యసించడానికి కావలసిన టీఎల్ఎమ్స్, బుక్స్ సైతం సెంటర్లలో అందుబాటులో చేరాయి. ప్లేయింగ్ గేమ్స్ కార్డ్స్, క్యాలెండర్స్, వర్క్ బుక్స్ వంటివి పిల్లలకు కృత్యాలు చేసి కృత్యాధార విద్యను అభ్యసించే విధంగా తోడ్పడుతున్నాయి.

ఆఫీసులకు చేరిన ప్రీ స్కూల్ మెటీరియల్స్..

అంగన్వాడీలకు ప్రీ ప్రైమరీ స్కూళ్లను జత చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయానికి పునుకుంది. ఈ క్రమంలోనే ఆచరణ దిశగా మొదటి విడతలో భాగంగా ఇప్పటికే సంబంధిత సెంటర్లలో ఫ్రీ స్కూల్ మెటీరియల్స్ చేర్చారు. దీంట్లో భాగంగా పిల్లలకి స్టడీ టేబుల్స్, రౌండ్ టేబుల్స్, రెక్టాంగిల్ టేబుల్స్, మ్యాట్స్ ఇలా పలు రకాల వస్తువులు చేరాయి. భైంసా ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఎనిమిది సెక్టార్లకు గాను 205 అంగన్వాడీ సెంటర్లు ఉండగా.. మొదటి విడతలో భాగంగా దాదాపు 30 పూర్వ ప్రాథమిక కేంద్రాలకు సరిపడే వస్తువులు ఇక్కడికి చేరినట్లు సమాచారం. మిగతా సంబంధిత మెటీరియల్స్ తొందరలోనే రానున్నాయి. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి ఆ మెటీరియల్స్ పంపిణీకి సంబంధించి కార్యక్రమం అధికారికంగా నిర్వహించిన వెంటనే అన్ని పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల్లో ఆ వస్తువులు చేరనున్నాయని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed