చిరుతను తప్పించబోయి బోల్తా పడిన కారు.. మహిళ మృతి

by Rajesh |
చిరుతను తప్పించబోయి బోల్తా పడిన కారు.. మహిళ మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అడవి ప్రాంతంలో ప్రయాణిస్తున్న కారుకు చిరుత అడ్డు రావడంతో దానిని తప్పించే ప్రయత్నంలో ఆవాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా ఆయన భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన మాలోత్ ప్రభాకర్ అతని భార్య లలిత లు మోపాల్ మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. కారులో సొంత గ్రామానికి తిరిగి వస్తుండగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ఎల్లమ్మకుంట శివారులో రాత్రి చిరుతను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో చెందిన మాలోత్ లలిత(30) అక్కడికక్కడే మృతి చెందగా భర్త మాలోత్ ప్రభాకర్ తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ప్రభాకర్ ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం ఘటన స్థలాన్ని మోపాల్ పోలీసులు సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

Next Story

Most Viewed