Chandrayaan-3:జాబిల్లి ఉపరితలాన్ని కప్పేసిన శిలాద్రవం.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

by Jakkula Mamatha |
Chandrayaan-3:జాబిల్లి ఉపరితలాన్ని కప్పేసిన శిలాద్రవం.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టి రేపటికి (ఆగస్టు 23వ) ఏడాది పూర్తి అవుతుంది. ఈ ఘన విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో జాబిల్లి గుట్టు విప్పి రహస్యలను బయటపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహిస్తున్న చంద్రయాన్ ప్రయోగాలతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజా డేటాను పరిశోధించిన శాస్త్రవేత్తలు అందులోని కీలక విషయాలను వెల్లడించారు.

తాజా విశ్లేషణ ప్రకారం..గతంలో చంద్రుడి ఉపరితలం అంతా శిలాద్రవంతో నిండి ఉండేదని చెబుతున్న సిద్ధాంతానికి చంద్రయాన్‌-3 లో సేకరించిన డేటా మరింత బలాన్ని చేకూర్చుతుందని తెలిపారు. ఈ మేరకు అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీతో పాటు పలు సంస్థలకు చెందిన అధ్యయనాలకు సంబంధించిన వివరాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి. చంద్రయాన్‌-3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై శివశక్తి పాయింట్ వద్ద గత ఏడాది ఆగస్టులో ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికి వచ్చిన ప్రజ్ఞాన్‌ రోవర్‌.. అది దిగిన ప్రాంతం నుంచి 100 మీటర్ల దూరం ప్రయాణించి నమూనాలను సేకరించి వాటి సమాచారాన్ని ఇస్రోకు అందించింది.

గ్రహాలుగా అవతరించడానికి ముందు దశలో ఉన్న రెండు ప్రొటోప్లానెట్ లు పరస్పరం ఢీ కొట్టుకోవడమే జాబిల్లి పుట్టుకకు కారణం. ఆ రెండింటిలో పెద్దది భూమిగా, చిన్నది చంద్రుడిగా కాలక్రమంలో అవతరించాయి. బలంగా ఢీ కొట్టుకోవడం వల్ల జాబిల్లి తొలుత బాగా వేడెక్కింది. ఆ వేడికి దాని మాంటిల్ పొర మొత్తం కరిగి మాగ్మా సముంద్రం గా మారిపోయింది. పూర్తి రూపం సంతరించుకునే క్రమంలో చందమామ చల్లబడిందని సమాచారం. తక్కువ సాంద్రతతో కూడిన ఎఫ్‌ఏఎన్ ఉపరితలం వైపు చేరుకుంది. బరువైన ఖనిజాలు మునిగి మాంటిల్‌ను ఏర్పరిచాయి. అయితే ఈ క్రమంలో మాగ్మా సముద్ర సిద్ధాంతం అక్కడ మెగ్నీషియం అనవాళ్లు ఎలా లభించాయన్నడానికి సరైన వివరణ ఇవ్వలేకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed