రాజకీయ లబ్ధి కోసమే: అశోక్ బాబు

by srinivas |
రాజకీయ లబ్ధి కోసమే: అశోక్ బాబు
X

దిశ, అమరావతి: రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ప్రభుత్వం పారిశ్రామిక రాయితీలు ఇస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక బాబు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పారిశ్రామిక పాలసీనే వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తోందని అన్నారు. సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త పాలసీని తీసుకురాలేనప్పుడు పాత పాలసీ కింద రాయితీలు ఇవ్వాల్సిందేనని అన్నారు. 2014-19 మధ్య కాలంలో రూ. 3,675 కోట్లు పారిశ్రామిక రాయితీల కింద చెల్లించామని చెప్పారు. జగన్ ప్రభుత్వం పారిశ్రామిక రాయితీలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని విమర్శించారు. ఎమ్మెల్యే మద్దాలి గిరికి చెందిన కంపెనీకి రాయితీలను పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు విడుదల చేయడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.

Next Story

Most Viewed