వాళ్లు ఎవరో బయటపడాలి : నారా లోకేష్

by  |
వాళ్లు ఎవరో బయటపడాలి : నారా లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చు రాజేస్తున్న వారే, ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రథం దగ్ధం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. ఈ ఘటనల వెనుక ఉన్న ముఖ్య పాత్రధారులు ఎవరో బయటపడాలి. వరుస ఘటనలకు కారణమైన వారు ఎంత పెద్ద వారైనా శిక్షించాలి’ అంటూ ట్విట్టర్ వేదికగా లోకేష్ డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed