శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఆ రోజే…

by srinivas |
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఆ రోజే…
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయో లేదో అని భక్తులు సందిగ్ధంలో పడ్డారు. కాగా బ్రహ్మోత్సవాలపై క్లారిటీ వచ్చేసింది. టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబర్ 18న‌ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జ‌రుగ‌నుంది.

సెప్టెంబరు 19న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 23న శ్రీవారి గరుడసేవ, 24న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 26న ర‌థోత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జా‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం జ‌రుగుతుంది.

Advertisement

Next Story