తుఫాను తెచ్చిన కష్టం.. బార్బడోస్ లోనే చిక్కుకున్న టీమిండియా

by Shamantha N |
తుఫాను తెచ్చిన కష్టం.. బార్బడోస్ లోనే చిక్కుకున్న టీమిండియా
X

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్‌కప్‌ గెలుపు జోష్ లో ఉన్న టీమిండియాకు తుఫాను కష్టాలు వచ్చిపడ్డాయి. ఫైనల్ మ్యాచ్ కు వేదిక అయిన బార్బడోస్ లోనే భారత జట్టు ఇరుక్కుపోయింది. అట్లాంటిక్‌లో ఉద్భవించిన 'బెరిల్' తుఫాను కారణంగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అంతేకాకుండా, తుఫాను తీవ్రతరం అవ్వడంతో బార్బడోస్ ఎయిర్ పోర్టుని కూడా మూసివేశారు. దీంతో, టీమిండియా బార్బడోస్‌లోనే ఉండిపోయింది. కాబట్టి బార్బడోస్ విమానాశ్రయం మూసివేయబడింది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. బయటకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు తెలిపారు. తుఫాను తగ్గి.. పరిస్థితి సద్దుమణిగితే టీమిండియా స్వదేశానికి రానుంది.

ఘనస్వాగతం పలికేలా ఏర్పాట్లు

బార్బడోస్‌లో భారత బృందం హిల్టన్‌లో బస చేస్తుంది. షెడ్యూల్‌ ప్రకారం టీమిండియా జులై 1 ఉదయం 11 గంటలకంతా భారత్‌లో ల్యాండ్‌ కావల్సి ఉండింది. భారత రూట్‌ మ్యాప్‌ బార్బడోస్‌ నుంచి న్యూయార్క్‌కు.. న్యూయార్క్‌ నుంచి దుబాయ్‌కు.. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకునేలా ఉండింది. అయితే బెరిల్‌ తుఫాను టీమిండియా రిటర్న్‌ ప్లాన్లు దెబ్బతీసింది. ఇదిలా ఉంటే, భారత ఆటగాళ్లు టీమిండియాకు రాగానే.. ఘనస్వాగతం పలకాలని ఎదురుచూస్తున్నారు. భారత ప్రభుత్వం సైతం వరల్డ్‌కప్‌ హీరోలను ఘనంగా స్వాగతం పలకాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది.

Next Story

Most Viewed