ఆ ముగ్గురు టెస్టులు, వన్డేల్లో కొనసాగుతారు : వీవీఎస్ లక్ష్మణ్

by Harish |
ఆ ముగ్గురు టెస్టులు, వన్డేల్లో కొనసాగుతారు : వీవీఎస్ లక్ష్మణ్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా.. టెస్టు, వన్డే ఫార్మాట్లలో కొనసాగుతారని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. రోహిత్, కోహ్లీ, జడేజా రిటైర్మెంట్‌పై లక్ష్మణ్ తాజాగా స్పందించాడు. ఆ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘రోహిత్, కోహ్లీ, జడేజా అద్భుతమైన నైపుణ్యం కలిగిన ప్లేయర్లు. వారు భారత్ క్రికెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారికి నా అభినందనలు. వారి ఆటతో యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచారు. పొట్టి ఫార్మాట్‌ నుంచి రిటైర్ అయినా.. మిగతా ఫార్మాట్లలో తమ కెరీర్‌ను కొనసాగిస్తారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తూనే ఉంటారు. సుదీర్ఘ ఫార్మాట్, వన్డే ఫార్మాట్‌లో వాళ్లు కొనసాగుతారని కచ్చితంగా చెప్పగలను.’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. జింబాబ్వే పర్యటనలో యువ భారత్‌కు లక్ష్మణ్ కోచ్‌గా వెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed