ఏటీపీ చాలెంజర్ టోర్నీలో సుమిత్ శుభారంభం

by Harish |
ఏటీపీ చాలెంజర్ టోర్నీలో సుమిత్ శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్ : జర్మనీలో జరుగుతున్న బ్రౌన్‌స్చ్‌వేగ్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు. ఈ టోర్నీలో మెన్స్ సింగిల్స్‌లో అతను రెండో సీడ్‌గా బరిలోకి దిగాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సుమిత్ 6-1, 6-4 తేడాతో బ్రెజిల్ ప్లేయర్ ఫెలిపే అల్వెస్‌పై విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌ను సుమిత్ గంటా 14 నిమిషాల్లోనే సొంతం చేసుకున్నాడు. నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేశాడు. రెండో రౌండ్‌లో అర్జెంటీనా ప్లేయర్ పెడ్రో కాచిన్‌తో సుమిత్ తలపడనున్నాడు. ఈ సీజన్‌లో సత్తాచాటిన సుమిత్ తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed