అండర్‌-19 జట్టుకు ఎంపికైన ద్రవిడ్‌ తనయుడు..

by Vinod kumar |
అండర్‌-19 జట్టుకు ఎంపికైన ద్రవిడ్‌ తనయుడు..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్​ఇండియా ప్రధాన కోచ్​రాహుల్ ద్రవిడ్​తనయుడు సమిత్ ద్రవిడ్ కర్ణాటక అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలో జరగనున్న వినూ మన్కడ్ ట్రోఫీకి ఎంపికైన 15 మంది సభ్యుల కర్ణాటక జట్టులో 17 ఏళ్ల సమిత్‌కు చోటు దక్కింది. కాగా రాహుల్ ద్రవిడ్ ఇద్దరు పిల్లలు తమ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. పెద్ద కొడుకు సమిత్, చిన్న కొడుకు అన్వయ్‌ ఇద్దరూ క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు. ద్రవిడ్‌ పెద్ద కుమారుడు సమిత్ ఐపీఎల్ సమయంలో తన తండ్రి క్రికెట్ ఆట చూస్తూ పెరిగాడు.

వినూ మన్కడ్ టోర్నీ అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ అండర్-19 టోర్నీ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరగనుంది. కర్ణాటక అండర్‌ 19జట్టుకు ధీరజ్ గౌడ నాయకత్వం వహిస్తుండగా, ధృవ్ ప్రభాకర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. హర్షిల్ ధర్మాని, యువరాజ్ అరోరా కూడా వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. మరి హైదరాబాద్‌లో జరిగే ఈ టోర్నీలో రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

కర్ణాటక అండర్ 19 జట్టు:

ధీరజ్ జె. గౌడ (కెప్టెన్), ధృవ్ ప్రభాకర్ (వైస్ కెప్టెన్), శివమ్ సింగ్, కార్తీక్ ఎస్​యూ, సమిత్ ద్రవిడ్, యువరాజ్ అరోరా (వికెట్ కీపర్), హార్దిక్ రాజ్, ఆరవ్ మహేష్, ఆదిత్య నాయర్, ధనుశ్​ గౌడ, హర్షిల్ ధర్మాని (వికెట్ కీపర్), శిఖర్ శెట్టి, సమర్థ్ నాగరాజ్, కార్తికేయ కెపి, శేషిత్

Advertisement

Next Story