‘నువ్వు సైనా భర్తవని ఎందుకు చెబుతున్నావు’.. ధోనీ మాటలకు షాకైన కశ్యప్

by Harish |
‘నువ్వు సైనా భర్తవని ఎందుకు చెబుతున్నావు’.. ధోనీ మాటలకు షాకైన కశ్యప్
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన కశ్యప్ 2018లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌ను వివాహమాడాడు. ఇటీవల ఓ పెళ్లిలో భారత మాజీ క్రికెటర్ ఎం.ఎస్ ధోనీని కశ్యప్ కలిశాడట. తాను ఎవరో తెలిసి ఉండకపోవచ్చనే ఉద్దేశంతో కశ్యప్ తాను సైనా భర్తని అని పరిచయం చేసుకున్నాడట. అప్పుడు ధోనీ రియాక్షన్‌కు షాక్ అయ్యాయని కశ్యప్ తెలిపాడు. తాజాగా ఓ పాడ్ ‌కాస్ట్‌లో పాల్గొన్న కశ్యప్.. దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్ ధోనీతో జరిగిన సరదా సంభాషణను పంచుకున్నాడు.

‘ఇటీవల ఓ పెళ్లిలో ధోనీని కలిశా. నన్ను నేను సైనా భర్తగా పరిచేయం చేసుకున్నా. అక్కడ నేను సైనాకు ప్లస్ వన్ అనుకున్నా. కొందరు నన్ను గుర్తు పట్టొచ్చు. అది కూడా బ్యాడ్మింటన్‌ను ఫాలో అయ్యే వారు. నేను క్రికెట్‌కు, ధోనీకి అభిమాని. అప్పుడు ధోనీ ‘మీరు నాకు తెలుసు భయ్యా. నేనూ బ్యాడ్మింటన్ ఆడతా. మీరు సైనా భర్త అని నాకు చెప్పాల్సిన అవసరం లేదు.’అని అన్నాడు. ధోనీ నాతో ఓ స్నేహితుడిలా మాట్లాడాడు.’ అని కశ్యప్ వివరించాడు. కాగా, 2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కశ్యప్ మెన్స్ సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2020లో అతను రిటైర్మెంట్ ప్రకటించాడు.

Advertisement

Next Story

Most Viewed