పారిస్ ఒలింపిక్స్‌లో సాత్విక్ జోడీకి సులవైన డ్రా

by Harish |
పారిస్ ఒలింపిక్స్‌లో సాత్విక్ జోడీకి సులవైన డ్రా
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్‌-చిరాగ్ జంటకు సులవైన డ్రా లభించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) సోమవారం పురుషుల డబుల్స్ గ్రూపు స్టేజ్ డ్రాను రిలీజ్ చేసింది. అందులో సాత్విక్ జోడీని గ్రూపు-సిలో చేర్చారు. గ్రూపులో సాత్విక్-చిరాగ్ జంట పెద్దగా పోటీ లేకపోవడంతో నాకౌట్‌కు చేరుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

గ్రూపులో భారత జంటకు వరల్డ్ నం.6 ఆల్ఫియన్-ఆర్డియంటో(ఇండోనేషియా) జోడీతో మాత్రమే సవాల్ ఎదురుకానుంది. తమ కంటే తక్కువ ర్యాంక్ కలిగిన మార్క్ లామ్స్‌ఫస్-మార్విన్ సీడెల్(జర్మనీ), లూకాస్ కార్వీ-రోనన్ లాబర్(ఫ్రెంచ్) జంటలపై విజయం నల్లేరు మీద నడకే. వారిపై మంచి రికార్డు కూడా కలిగి ఉన్నది. ప్రస్తుతం వరల్డ్ నం.3 ర్యాంక్‌లో ఉన్న సాత్విక్, చిరాగ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ ఏడాది నాలుగు టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకున్నారు. ఫ్రెంచ్ ఓపెన్, థాయిలాండ్ ఓపెన్ విజేతగా నిలిచారు. ఒలింపిక్స్‌లో సాత్విక్-చిరాగ్ జంటపై పతక ఆశలు భారీగా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed