భారత్‌పై అందుకే అఫ్గాన్ గెలవదు.. పాక్ జర్నలిస్ట్‌ పోస్టుపై అశ్విన్ కౌంటర్ ఇదే

by Harish |
భారత్‌పై అందుకే అఫ్గాన్ గెలవదు.. పాక్ జర్నలిస్ట్‌ పోస్టుపై అశ్విన్ కౌంటర్ ఇదే
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తన అభిప్రాయాలు వ్యక్తం చేయడంతోపాటు ఎవరైనా భారత్‌పై నోరుపారేసుకుంటే వెంటనే కౌంటర్ ఇస్తాడు. తాజాగా భారత్‌పై అక్కసు వెళ్లగక్కతూ ఓ పాక్ జర్నలిస్ట్ చేసిన పోస్టు తన ‘ఎక్స్’ టైమ్‌లైన్‌పై కనిపించడం అశ్విన్‌కు కోపం తెప్పించింది.

అసలేం జరిగిందంటే.. టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గాన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌‌ను ప్రసావిస్తూ పాక్ జర్నలిస్ట్ వజావత్ కజ్మీ భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. ‘అఫ్గాన్ జట్టు ప్రపంచంలో ఏ టీమ్‌నైనా ఓడించగలదు. కానీ, భారత్‌పై గెలవకపోవడానికి కారణముంది. ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు చాలా విలువైనవి.’ అని ఎక్స్ వేదికగా నోరు పారేసుకున్నాడు.

ఆ పోస్టు తన టైమ్‌లైన్‌పై కనిపించడంతో అశ్విన్ సీరియస్ అయ్యాడు. ‘ఎలన్ మస్క్ మీరు ఏం చేయాలో నేను చెప్పను. కానీ, నా ఇంట్లోకి ఎవరు రావాలని నిర్ణయించే హక్కు నాకు కచ్చితంగా ఉండాలి. నా టైమ్‌లైన్‌. నా డెసిషన్’ అని పోస్టు చేశాడు. ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ నెటిజన్ ‘బ్లాక్ బటన్ ఉంది’ అని కామెంట్ చేయగా.. దానికి అశ్విన్ బదులిస్తూ ‘అది నా పని కాదు. నేను ఎవరిని ఫాలో కావాలో నాకు తెలుసు’ అని రిప్లే ఇచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed