Olympics: ఫైనల్‌కు చేరిన నీరజ్ చోప్రా

by Gantepaka Srikanth |
Olympics: ఫైనల్‌కు చేరిన నీరజ్ చోప్రా
X

దిశ, వెబ్‌డెస్క్: ఒలంపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు మూడు పతకాలు వచ్చాయి. తాజాగా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా పారిస్ ఒలంపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు చేరారు. క్లాలిఫయర్ రౌండ్‌లో అతడు జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరారు. దీంతో ఫైనల్‌కు అర్హత లభించింది. ఈ నెల 8వ తేదీన రాత్రి 11:55 గంటలకు జరిగే ఫైనల్‌ ఈవెంట్‌లో నీరజ్ పాల్గొననున్నారు. దీంతో అతను గోల్డ్ మెడల్ సాధించాలని దేశం మొత్తం ప్రార్థిస్తోంది. ఇప్పటివరకు ఈ ఒలింపిక్స్‌ మెగా టోర్నమెంట్ ఇండియాకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాకపోవడంలో అందరూ నీరజ్ మీదే ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

Next Story