ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెటర్‌కు ధోనీ స్పెషల్ గిఫ్ట్..

by Vinod kumar |
ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెటర్‌కు ధోనీ స్పెషల్ గిఫ్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్‌కు రహ్మానుల్లా గుర్భాజ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్భాజ్‌ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. ధోని పంపిన గిఫ్ట్‌ను పట్టుకుని ఫోటోకు పోజిస్తూ.. తాను అడిగిన బహుమతిని పంపినందుకు ధోనికి కృతజ్ఞతలు తెలిపాడు. భారత్‌ నుంచి ఈ గిఫ్ట్‌ పంపినందుకు థ్యాంక్స్‌ మాహీ సర్‌ అని ఇన్‌స్టా పేజీలో రాసుకొచ్చాడు. ఐపీఎల్‌ 2023లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన గుర్భాజ్‌.. 20.64 సగటున, 133.53 స్ట్రయిక్‌ రేట్‌తో 227 పరుగులు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed