MS Dhoni: యూఎస్ ఓపెన్‌లో ధోనీ సందడి.. వీడియో వైరల్

by Vinod kumar |
MS Dhoni: యూఎస్ ఓపెన్‌లో ధోనీ సందడి.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సందడి చేశాడు. వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌కు ధోనీ తన స్నేహితులతో కలిసి హాజరయ్యాడు. ఓ సాధారణ ప్రేక్షకుడిగా మ్యాచ్‌ను ఆస్వాదించాడు. ఆట మధ్యలో అల్కరాజ్ కాసేపు విశ్రాంతి తీసుకుని డ్రింక్స్‌ తాగుతుండగా అతని వెనుకవైపు ప్రేక్షకుల సీట్లలో కూర్చుని ఉన్న ధోనీ తన ఫ్రెండ్స్‌తో ముచ్చటిస్తూ కనిపించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 6-3, 6-2, 6-4 తేడాతో 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను మట్టి కరిపించాడు. ఈ విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 30 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో అల్కరాజ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించి వరుస సెట్లలో విజయం సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను విజేతగా నిలిపాడు. అనంతరం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed