టీమిండియాకు బిగ్ షాక్.. చివరి టెస్టులకు కూడా స్టార్ బౌలర్ దూరం..?

by Vinod kumar |
టీమిండియాకు బిగ్ షాక్.. చివరి టెస్టులకు కూడా స్టార్ బౌలర్ దూరం..?
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మరికొంత కాలం పాటు జట్టులో చేరడం అసాధ్యమని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను చాలా కీలకం అవుతాడని భావించారు. కానీ, గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోలేదు. దీంతో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో అతనికి చోటు దక్కలేదు.

అయితే చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుందని.. దీంతో ఆసీస్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు కూడా అతను దూరం అవుతున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో టీమిండియాకు బుమ్రా చాలా కీలకం కానున్నాడు.

Advertisement

Next Story

Most Viewed