- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
IND vs AUS: 'ఆసీస్తో ఆడినంత మాత్రాన సరిపోతుందా?'.. అశ్విన్పై ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర కామెంట్స్
దిశ, వెబ్డెస్క్: స్వదేశంలో ఆసీస్తో జరగనున్న వన్డే సిరీస్కు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దాదాపు 20 నెలల తర్వాత తొలిసారి వన్డే జట్టులో అశ్విన్ చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ ఎంపిక చేస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గాయంతో బాధపడుతున్న అక్షర్ పటేల్ స్ధానంలో అశ్విన్ వరల్డ్కప్ జట్టులోకి కూడా వస్తాడని చాలా మంది అభిప్రాయపడతున్నారు.
ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. సెలక్టర్లు, మేనెజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని పఠాన్ తప్పుబట్టాడు. ఆసీస్తో ఆడినంత మాత్రన సరిపోతుందా? పది ఓవర్ల బౌలింగ్ వేయించాలి. అలాగే ఫలితం భారత్కు అనుకూలంగా రావాలి. ఇది అంత సులభం కాదు. ప్లానింగ్ మెరుగ్గా ఉండాలి" అంటూ ఇర్ఫాన్ పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో అశ్విన్ ఒకడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అతడు చాలా కాలంగా వన్డే ఫార్మాట్కు దూరంగా ఉన్నాడు. సీనియర్ ప్లేయర్ అయినంత మాత్రాన నేరుగా వచ్చేసి ఈ ఫార్మాట్లో సాధారణంగా ఆడేస్తాడని భావించడం సరికాదు. సరైన ప్లానింగ్తో అతడిని ఎంపిక చేయలేదు. అతడు మీ వరల్డ్కప్ ప్రణాళికలలో ఉండి ఉంటే ముందే అవకాశం ఇవ్వాల్సింది.