పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

by Sridhar Babu |
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
X

దిశ, బెజ్జూర్ : బెజ్జూరు మండలంలోని సోమిని గ్రామపంచాయతీ పరిధిలోని నందరాంగూడ గ్రామానికి చెందిన గావిడె అమృత (19) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అమృత గత కొద్ది నెలలుగా మతిస్థిమితం కోల్పోయి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు సేవించగా కుటుంబ సభ్యులు గమనించి ఆటోలో బెజ్జూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు కాగజ్నగర్ పట్టణానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి సోదరుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా గురువారం తహసీల్దార్ భూమేశ్వర్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి వివరాలు సేకరించారు.

Advertisement

Next Story