చివరి మ్యాచ్‌లో భారత హాకీ జట్లు ఓటమి

by Harish |
చివరి మ్యాచ్‌లో భారత హాకీ జట్లు ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ 2023-24 సీజన్‌ను భారత పురుషుల, మహిళల హాకీ జట్లు ఓటమితో ముగించాయి. ఆదివారం లండన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌ల్లో భారత జట్లు గ్రేట్ బ్రిటన్ చేతిలో పరాజయం పాలయ్యాయి. పురుషుల జట్టు 2-3 తేడాతో ఓడిపోగా.. మహిళల జట్టు కూడా అంతే తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. పురుషుల జట్టు 5 విజయాలు, 6 డ్రాలతో 24 పాయింట్లు సాధించి టోర్నీని 4వ స్థానంతో ముగించింది. మరోవైపు ఈ సీజన్‌లో మహిళల జట్టు పేలవ ప్రదర్శన చేసింది. యూరప్ పర్యటనలో ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. మొత్తం టోర్నీలో కేవలం 2 విజయాలు, ఒక డ్రాతో 8 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed