Badminton Asia Junior Championships 2023: క్వార్టర్స్‌లో భారత్ ఓటమి..

by Vinod kumar |
Badminton Asia Junior Championships 2023: క్వార్టర్స్‌లో భారత్ ఓటమి..
X

యోగ్యకర్త : ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్ సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది. క్వార్టర్ ఫైనల్స్‌లోనే నిష్ర్కమించింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 1-3 తేడాతో ఆతిథ్య ఇండోనేషియా చేతిలో పోరాడి ఓడింది. ముందుగా మిక్స్‌డ్ డబుల్స్‌లో మ్యాచ్‌లో భారత జోడీ సమర్‌వీర్-రాధిక శర్మ 16-21, 15-21 తేడాతో అడ్రియన్ ప్రతమ-ఫెలిషా అల్బెర్టా చేతిలో ఓడింది. ఆ తర్వాత మెన్స్ సింగిల్స్‌ మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 21-18, 15-21, 19-21 తేడాతో అల్వీ ఫర్హాన్ చేతిలో ఓడటంతో భారత్ 0-2 తేడాతో వెనుకబడింది. దాంతో తప్పక గెలవాల్సిన ఉమెన్స్ సింగిల్స్‌ మ్యాచ్‌లో రక్షిత శ్రీ సంచలన ప్రదర్శన చేసింది.

రుజానాపై 21-18, 10-21, 23-21 తేడాతో గెలిచి భారత్‌ను పోటీలో నిలబెట్టింది. అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లో పురుషుల జోడీ నిరాశపర్చడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. మెన్స్ డబుల్స్‌ మ్యాచ్‌లో దివ్యమ్ అరోరా-మయాంక్ రానా జోడీ 10-21, 21-15, 21-12 తేడాతో మహ్మద్ అల్ ఫర్జి-నికోలస్ జోక్విన్ చేతిలో ఓడిపోయింది. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ ఓటమి ఖరారైంది. సెమీస్‌కు దూసుకెళ్లిన ఇండోనేషియా అక్కడ థాయిలాండ్‌‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. నేడు జరిగే ఫైనల్‌లో ఇండోనేషియా, జపాన్ తలపడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed