IND vs WI: భారత్, విండీస్ జట్లకు జరిమానా..

by Vinod kumar |
IND vs WI: భారత్, విండీస్ జట్లకు జరిమానా..
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో చిత్తుగా ఓడిన భారత్‌కు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు టీమిండియాకు ఐసీసీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో సమయానికి తమ కోటా ఓవర్లు పూర్తి చేయడంలో టీమిండియా విఫలమైంది. టైం అయిపోయే సరికి టీమిండియా మరో ఓవర్ వేయాల్సి ఉంది. దీంతో ఈ టీం మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అదే సమయంలో విండీస్ రెండు ఓవర్లు లేట్‌గా వేసింది. దీంతో ఆ టీంకు 10 శాతం జరిమానా విధించారు.

Advertisement

Next Story

Most Viewed