నిలకడగా రాణిస్తున్న పంత్, గిల్.. భారీ ఆధిక్యంలో భారత్

by Mahesh |
నిలకడగా రాణిస్తున్న పంత్, గిల్.. భారీ ఆధిక్యంలో భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నై వేదికగా జరగుతున్న IND vs BAN మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. అనంతరం బంగ్లాదేశ్ ను కేవలం 149 పరుగులకే చిత్తు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడో రోజు మ్యాచ్ పై మరింత పట్టు బిగించింది. మూడో రోజు పంత్ 82, గిల్ 82 పరుగులో క్రీజులో ఉన్నారు. దీంతో భారత్ లంచ్ బ్రేక్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో భారత్ మొత్తం 432 పరుగుల లీడ్ లో కొనసాగుతుంది. ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న పంత్, గిల్ సెంచరీలకు దగ్గరగా ఉండటంతో వారి సెంచరీ అనంతరం డిక్లేర్ ఇచ్చే అవకాశం ఉంది.

Next Story

Most Viewed