వైసీపీకి బిగ్ షాక్.. రేపు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే

by Jakkula Mamatha |
వైసీపీకి బిగ్ షాక్.. రేపు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోద కూడా జగన్ దక్కించుకోలేకపోయారు. దీంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. దీంతో పార్టీ నేతలు వైసీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరారు. తాజాగా బాలినేని, సామినేని ఉదయభాను కూడా పార్టీని వీడి జనసేనలో ( Janasena Party ) చేరతానని ప్రకటించారు. ఇక తాజాగా ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. రేపు(ఆదివారం) మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు గుంటూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా జనసేనలో జాయిన్ కానున్నారు. కిలారి రోశయ్య 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2024లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

Next Story

Most Viewed