ఆగని వర్షం.. నిలిచిన రెండో రోజు ఆట

by Y. Venkata Narasimha Reddy |
ఆగని వర్షం.. నిలిచిన రెండో రోజు ఆట
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట కూడా వర్షం కారణంగా నిలిచిపోయింది. మైదానం వర్షం నీటితో చిత్తడిగా మారడంతో రెండో రోజు ఆట సాధ్యం కాలేదు. దీంతో ఇరు జట్లు హోటల్ కు వెళ్ళిపోయాయి. రెండో రోజు ఆటపై అధికారికంగా అంపైర్లు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభిస్తారా లేక రెండో రోజు ఆట పూర్తిగా రద్దవుతుందా అన్నది తేలాల్సి ఉంది.

తొలి రోజు కూడా వర్షంతో టాస్ ఆలస్యం కావడం..కేవలం 35ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవ్వడం భారత్ విజయావకాశాలకు ప్రతికూలంగా మారింది. తొలి రోజు ఆటలో బంగ్లా జట్టు మూడు వికెట్లకు 107పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో మోమినల్ 40, ముష్ఫికర్ 6పరుగులతో ఆడుతున్నారు. భారత ఆకాశ్ దీప్ 2, అశ్విన్ 1 వికెట్ తీశారు.

Advertisement

Next Story

Most Viewed