పాకిస్థాన్ కు రూ.586 కోట్లు.. ఇచ్చింది ఎవరో తెలుసా..?

by M.Rajitha |
పాకిస్థాన్ కు రూ.586 కోట్లు.. ఇచ్చింది ఎవరో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్ : వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య ఖర్చుల కోసం ఐసీసీ పాకిస్థాన్ కు 66 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.586 కోట్లు) అందించనుంది. వారం రోజుల క్రితం కొలంబోలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ఈ భారీ బడ్జెట్ ను ఐసీసీ సభ్యదేశాలు ఆమోదించినట్లు సమాచారం. భారత్ మినహా అన్ని సభ్య దేశాలు పాకిస్థాన్ లో టోర్నీ జరిగేందుకు సమ్మతం తెలిపాయి. ఈ సమావేశంలో భారత్ తెలిపిన భద్రతా కారణాల అభ్యంతరం ప్రకారం భారత్ పాకిస్థాన్ దాయాదుల మధ్య మ్యాచెస్ మాత్రం పాకిస్థాన్ బయట జరగనున్నాయి. ఇవి శ్రీలంక లేదా యూఏఈలో జరిగే అవకాశాలుండగా.. మళ్ళీ వీటికోసం ప్రత్యేకంగా 4.5 మిలియన్ డాలర్లను ఆ దేశానికి ఐసీసీ కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed