- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
'వరల్డ్ కప్ ఫైనలిస్ట్స్ వాళ్లే'.. సౌతాఫ్రికా మాజీ పేసర్
న్యూఢిల్లీ : 2023 వన్డే వరల్డ్ కప్లో భారత్తో కలిసి తన సొంత జట్టు ఫైనల్ చేరుకోవాలని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ఆశిస్తున్నాడు. ఇటీవలే 5 మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆస్ట్రేలియాను ఓడించిన దక్షిణాఫ్రికా.. ఐసీసీ మెగా టోర్నీకి ముందు మంచి ఫామ్లో ఉంది. బవుమా నాయకత్వంలోని జట్టు ఈ సిరీస్లో మొదటి 2 మ్యాచ్లు ఓడిపోయినా.. తర్వాత పుంజుకుని వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మేరకు తాజాగా స్టార్ స్పోర్ట్స్లో మాట్లాడిన స్టెయిన్.. వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా ఫైనల్ ఆడాలని తన హృదయం కోరుకుంటోందని తెలిపారు.
అయితే నవంబర్ 19న జరగనున్న టైటిల్ పోరులో భారత్, ఇంగ్లండ్ తలపడతాయని తన మనసు చెబుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే.. దక్షిణాఫ్రికాలో టీమ్లోని డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, రబడా చాలా కాలంగా ఐపీఎల్లో ఆడుతున్నందున.. భారత్లోని పరిస్థితుల గురించి వారికి అవగాహన ఉంటుందన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ జట్టుకు ఫైనల్ చేరగల సామర్థ్యం ఉందని భావిస్తున్నట్లుగా స్టెయిన్ వెల్లడించాడు.