రోహిత్‌ను కెప్టెన్ చేస్తే నన్ను తిట్టారు : గంగూలీ

by Harish |
రోహిత్‌ను కెప్టెన్ చేస్తే నన్ను తిట్టారు : గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తే అప్పుడు అందరూ తనను తిట్టారని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ గుర్తు చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్-2021 తర్వాత కోహ్లీ కెప్టెన్‌గా తప్పుకోవడంతో రోహిత్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా జాతీయ మీడియాతో గంగూలీ మాట్లాడుతూ..‘నేను రోహిత్ శర్మ భారత జట్టు కెప్టెన్సీని అప్పగించినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఇప్పుడు రోహిత్ నాయకత్వంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది. నిజానికి అతన్ని కెప్టెన్‌‌ను చేసింది నేనే అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారనుకుంటా.’ అని వ్యాఖ్యానించాడు. అలాగే, వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్ కోచ్‌గా ఉండాలనుకుంటున్నట్టు తన కోరికను బయటపెట్టాడు. ‘వచ్చే ఐపీఎల్ కోసం ప్లాన్ చేస్తున్నా. ఈ సారి ఢిల్లీ విజయం సాధించాలనుకుంటున్నా. హెడ్ కోచ్‌గా భారతీయుడిని నియమించాలని మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతా.’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed