పాక్‌ను చిత్తు చేసిన జట్టు భారత్‌కు.. టీమిండియాతో టెస్టు సిరీస్‌కు బంగ్లా జట్టు ఎంపిక

by Harish |
పాక్‌ను చిత్తు చేసిన జట్టు భారత్‌కు.. టీమిండియాతో టెస్టు సిరీస్‌కు బంగ్లా జట్టు ఎంపిక
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియాతో రెండు టెస్టులు, మూడు టీ20ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రానుంది. ఈ నెల 19 నుంచి అక్టోబర్ 1 వరకు రెండు టెస్టులు జరగనున్నాయి. టెస్టు సిరీస్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) గురువారం తమ జట్టును ప్రకటించింది. శాంటో కెప్టెన్సీలో 16 మందితో కూడిన టీమ్‌ను వెల్లడించింది. పేసర్ షోరిఫుల్ ఇస్లాం గాయం కారణంగా భారత్ టూరుకు దూరమయ్యాడు. షోరిఫుల్ మినహా ఇటీవల పాకిస్తాన్‌పై చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం సాధించిన జట్టునే ఎంపిక చేయడం గమనార్హం. ఈ నెల 19 నుంచి 23 వరకు చెన్నయ్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. బీసీసీఐ మొదటి టెస్టుకు మాత్రమే భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

బంగ్లా జట్టు : నజ్ముల్ శాంటో (కెప్టెన్), షద్మాన్‌ ఇస్లామ్, జకీర్ హసన్, మోమినల్ హక్, ముష్ఫికర్‌ రహీమ్, షకిబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహిదీ మిరాజ్, జకేర్ అలీ, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, నహిద్ రానా, తైజుల్ ఇస్లామ్, మహ్ముదుల్ హసన్ జాయ్, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్

Advertisement

Next Story

Most Viewed