Asia Cup: పాక్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్‌.. ఫైనల్‌లో భారత్‌తో ఢీ..

by Vinod kumar |
Asia Cup: పాక్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్‌.. ఫైనల్‌లో భారత్‌తో ఢీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) మహిళల ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023లో భాగంగా పాకిస్తాన్‌-ఏ, బంగ్లాదేశ్‌-ఏ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్-2 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 రన్స్ తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించగా.. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌-ఏ జట్టు 9 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఛేదనలో పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 53 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్‌ ఫైనల్‌కు చేరుకుంది.

మరోవైపు భారత మహిళల జట్టు కూడా ఫైనల్‌కు చేరుకుంది. శ్రీలంక-ఏతో జరగాల్సిన సెమీఫైనల్‌-1 వర్షం కారణంగా రద్దవ్వడంతో.. గ్రూప్‌ టాపర్‌‌గా ఉన్న భారత్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. రేపు జరుగబోయే ఫైనల్లో భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed